భారతదేశ అంతర్గత వ్యవహారాలలో అమెరికా జోక్యాన్ని ఖండించాలి

భారతదేశంలో మైనార్టీ మతస్తులపై దాడులు జరుగుతున్నాయి. దాడులు ముఖ్యంగా గుజరాత్, ఒరిస్సాలలో జరిగాయి. ఆ దాడులపై ఆందోళన చెందుతున్నాము. కాబట్టి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయాలనీ అంతర్జాతీయ సంస్థ ఒకటి మన ప్రభుత్వాన్ని అడిగిందట. దానికి మన ప్రభుత్వం ఒప్పుకొని తేది కూడా నిర్ణయం చేసింది. అది ఈ జూన్ 12 వ తేది. ఎందుకో ఆ సంస్థకు వీసాలు మంజూరు కాలేదు. దానితో ఆ పర్యటన అర్ధాంతరంగా ఆగిపోయింది. దానిపైన అమెరికా లోని మన రాయబారి ఉద్దేశ్య పూర్వకంగా మాకు వీసలివ్వకుండా మా ప్రయాణాన్ని ఆపారు. మేము ఇండియా వెళ్ళటం వారికీ ఇష్టం లేదు అని వ్యాఖ్యానించారు. ఆ సంస్థ పర్యటనను మన ప్రభుత్వం ఎందుకో ఆపింది. ఇంతకూ ఆ సంస్థ ఏమిటి?
ఆ సంస్థ పేరు యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం, అది అమెరికన్ కాంగ్రెస్స్ చేత ఆమోదించ బడింది. ఆ సంస్థ ప్రపంచంలోని మతాలపై, వాటి కార్య కలాపాలపైనివేదికలు తాయారు చేసి అమెరికా ప్రభుత్వానికి ఇస్తూ ఉంటుంది. ప్రపంచంలో క్రైస్తవ మిషనరీల రక్షణకు అవసరమైన సహకారం అందించటం దాని లక్ష్యంగా కనబడుతున్నది. మన దేశంలో ఒరిస్సా లో, గుజరాత్ లో మైనార్టీలపై జరిగిన దాడులను అధ్యయనం చేయటానికి అంటే మన దేశం అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం, ఆ జోక్యాన్ని నిరకరించ వలసిన ప్రభుత్వం యెట్లా అంగీకరించింది? ఏ కారణాల వల్ల ఆపిందో ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు తెలియచేయాలి.
ఇటువంటి సంస్థ సహకారము, అంతర్జాతీయ నిధులు, అండదండలు చూసుకొని ఇక్కడి క్రైస్తవ మిషనరీలు విచ్చల విడిగా తమ కార్య కలాపాలు సాగిస్తున్నాయి. వారికిఇక్కడి ప్రభుత్వాలూ పరోక్ష మద్దతునిస్తున్నాయి. కాబట్టే మత మార్పిడులు ఆగటం లేదు. ఈ పరిస్థితులను ఈ దేశ ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఆత్మ రక్షణకు ఎప్పుడు సన్నద్ధం అవుతారు?

No comments: